ప్రజాశక్తి-పుల్లలచెరువు పుల్లలచెరువు అభివృద్ధి చెందాలంటే టిడిపిని గెలిపించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కుమార్తె డాక్టర్ గూడూరి చెల్సియా, కుమారుడు గూడూరి అజిత్ అన్నారు. సోమవారం పుల్లలచెరువులో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్లలచెరువు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలం అభివృద్ధి చెందాలంటే టిడిపిని గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఎరిక్షన్బాబు, ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, నాయకులు శనగా నారాయణరెడ్డి, బడిపాటి ఓబులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.