ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కడవకల్లు గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు …. కడవకొల్లుకు చెందిన సుబ్బయ్య (45) ఆదివారం సాయంత్రం గుడి వద్ద పూజలు చేస్తుండగా, పాముకాటు వేసింది. వెంటనే చికిత్స కోసం తాడపత్రి ఆసుపత్రికి తరలించగా ఈరోజు ఉదయం సుబ్బయ్య మృతి చెందాడు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/snake-bite.jpg)