ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : పోస్టల్ బ్యాలెట్లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పోలీసులు, పలు విభాగాల ఉద్యోగులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక జిల్లాలో నివాసం, మరో జిల్లాలో విధి నిర్వహణ, డ్యూటీ ఎక్కడుంటే అక్కడ ఓటు వేసుకోవచ్చన్న అధికారులు.. ఇప్పుడు నివాసం స్థలం ఉన్న చోటే ఓటు వేయాలని చెబుతున్నారు. పోలీసులతో సహా పలు విభాగాల ఉద్యోగులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు అసలు ఎక్కడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తమకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.