ప్రజాశక్తి-సీతంపేట : వ్యాను బోల్తా పడి 17 మందికి గాయాలు అయ్యాయి. సీతంపేట మండలంలో పాండ్ర నుంచి సీతంపేట సంతకు వస్తున్న బొలెరో వ్యాన్ గెద్ద గూడ వద్ద బ్రేకులు ఫెయిల్ అయి వ్యాన్ బోల్తా పడింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వీరిని శ్రీకాకుళం రిమ్స్ రిఫర్ చేశారు. ఆరుగురిలో సవర తిక్కమ్మ, జోడీమీ గౌర్నాయుడు, గంగారావు, భోగన్న, సోంబురు తదితరున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/Van-overturns-17-injured.jpg)