నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Apr 6,2024 21:59
ఫొటో : సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపిడిఒ

ఫొటో : సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపిడిఒ
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ఎంపిడిఒ సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మండల వ్యాప్తంగా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్‌ ఎఇ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️