బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీధర్‌ శంకుస్థాపన

Mar 5,2024 14:38 #bridge, #cc roads, #Eluru district, #MLA

ప్రజాశక్తి- యడవల్లి (ఏలూరు) : లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, తారు రోడ్డు పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యడవల్లి-ఎర్రవారిగూడెం మధ్య బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం.విజయరాజు, చింతలపూడి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ జగ్గవరపు జానకి రెడ్డి, లింగపాలెం వైసిపి మండల అధ్యక్షుడు కొఠారి మోహన్‌ రావు, చింతలపూడి జడ్పిటిసి నీరజ తదితరులు పాల్గొన్నారు.

➡️