ప్రజాశక్తి -ఆనందపురం: భీమిలి నియోజకవర్గంలో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యేలా చూడాలని బూత్ ఏజెంట్లకు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆనందపురం మండల వైసిపి కార్యాలయంలో శుక్రవారం బూత్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఓటరుకూ తెలిసేలా వివరించాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. మరో 48 గంటలు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ బంక సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, జడ్పిటిసి సభ్యులు కోరాడ వెంకటరావు, వైస్ ఎంపిపిలు పాండ్రంకి శ్రీను, రామకృష్ణ, పాండ్రంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.వైసిపిలో పలువురు చేరిక వెల్లంకి పంచాయతీ నుంచి కాంగ్రెస్ నాయకుడు పడాల రాము సుమారు 50 మంది అనుచరులతో కలిసి శుక్రవారం ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైసిపిలో చేరారు.