అరెస్టులకు భయపడం.. సమస్యలను పరిష్కరించండి : మిమ్స్‌ ఉద్యోగులు

Feb 24,2024 10:37 #Dharna, #Mims employees, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మిమ్స్‌ ఉదయం ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయకుండా ఉద్యోగులను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ మిమ్స్‌ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి డి సి ఎల్‌ కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. మిమ్స్‌ ఉదయం ఉద్యోగులు వేతన ఒప్పందం చేయాలని, జనవరి నెల వేతనం ఇవ్వాలని, బకాయి ఉన్న ఏడు డి ఎ లు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ … 24 రోజులుగా సి ఐ టి యు ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. సమస్యను పరిష్కారం చేయాల్సిన యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా 9 మంది ఉద్యోగులను శనివారం ఉదయం ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేసి దెంకాడ పోలీసు స్టేషన్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. యాజమాన్యం ఉద్యోగుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉదఅతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా లో మిమ్స్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️