ప్రజాశక్తి-కడియం (తూర్పు-గోదావరి) : శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసికడియం పోలీసుల కవాతు నిర్వహించారు. రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, కడియం సీఐ బి. తులసీదర్ ఆధ్వర్యంలోకడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమగిరి గ్రామంలో సాయుధ బలగాలతో కలిసి పోలీస్ అధికారులు గ్రామ లో తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, దానికి పోలీసుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా కల్పిస్తున్నామన్నారు.