ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు ఆదివారం ఆయన వేటపాలెం పోలీస్ స్టేషన్ వద్ద రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ … జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతి రౌడీ షీటర్ పై నిరంతరం పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఉపక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 30 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు వెల్లడించారు. వారందరికీ పేరుపేరునా కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎస్సై జి సురేష్ పాల్గొన్నారు.