ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీ వైన్ కళాశాలలో ఆడిటోరియం పక్కన 5 బూత్ లలో ఉదయం 9 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 1384 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని ఆర్వో, ఆర్డీఓ ఎం.అచ్యుత్ అంబరీష్ తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/narsapuram-w.g.rtf.jpg)