ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం మున్సిపాలిటీలో 23వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ దూదేకుల ప్రసాదు బుధవారం రాత్రి కూర్చున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ఆయన ఎన్నికయ్యారు. ఆయనకు భార్యా పిల్లలు ఉన్నారు. కౌన్సిలర్ ప్రసాద్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డి, అన్నా వెంకట రాంబాబులు సంతాపం తెలిపారు. ప్రసాద్ భౌతికయానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/Councilor-Prasad-passed-away.jpg)