ప్రజాశక్తి-ప్రకాశం : గ్రామ సేవకుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గుర్రం నాగయ్య మృతి చెందారు. బుధవారం సాయంత్రం నాగయ్య తన ఇంటి ముందు రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీ కొంది. యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు.