ప్రజాశక్తి-కంభం రూరల్ (ప్రకాశం) : కంభం సిఐగా రామకోటయ్య బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ప్రస్తుతం కంభం సిఐగా పనిచేస్తున్న రాజేష్ కుమార్ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. దర్శి సిఐ గా విధులు నిర్వహిస్తున్న రామకోటయ్య కంభం కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రామకోటయ్య మాట్లాడుతూ … ప్రజలందరికీ తాను అన్నివేళలా అందుబాటులో ఉంటానని, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని, ప్రజలు తమ వంతుగా సహకరించాలని కోరారు.