మరమ్మతులకు గురైన తాగునీటి పథకం

Apr 6,2024 22:03
ఫొటో : నీటి కోసం పంపు దగ్గర ఇబ్బందులు పడుతున్న మహిళలు

ఫొటో : నీటి కోసం పంపు దగ్గర ఇబ్బందులు పడుతున్న మహిళలు
మరమ్మతులకు గురైన తాగునీటి పథకం
– చేతి పంపు దగ్గర ఇబ్బందులు పడుతున్న మహిళలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని కృష్ణ గాంధీపురం ఎస్‌సి కాలనీలో గత 10 రోజులుగా తాగునీటి పథకం మరమ్మతులకు గురైంది. అసలే ఎండలు మండిపోవడంతో బిందె నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కాలనీలో సుమారు 40 గృహాలు వారు నివసిస్తున్నారు. పనులకు పరుగులు తీసి సాయంత్రానికి ఇళ్లకు చేరుకొని నీళ్లు లేకపోవడంతో చేతిపంపు వద్ద కుస్తీ పడుతున్నారు. ఎన్నిసార్లు పాలకులకు తెలిపిన తాగునీటి పథకానికి సంబంధించిన స్టార్టర్‌ను మరమ్మతులు చేయించక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాలనీవాసులు అనే నెపంతో చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులైన స్పందించి మరమ్మతులకు గురైన తాగునీటి పథకానికి రిపేరు చేయించి, తాగునీరు యథావిధిగా సరఫరా అయ్యేలాగా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు.

➡️