అనుమానాస్పదస్థితిలో సచివాలయ ఉద్యోగి మృతి

ప్రజాశక్తి -పొన్నూరు (గుంటూరు) : వాటర్‌ లెవెల్స్‌ తీయడానికి విధుల్లో భాగంగా … మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ లోని 100 ఎకరాల సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ లో పడి సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. గత రెండు నెలల క్రితం తెనాలిలో పనిచేస్తూ పొన్నూరుకు బదిలీపై ఏడవ సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గా కిషోర్‌ బాబు బాధ్యతలు చేపట్టాడు. అతని భార్య ప్రకాశం జిల్లా దర్శి లో లేడీ కానిస్టేబుల్‌ గా పనిచేస్తూ బదిలీపై పొన్నూరు కు బదిలీ అయింది. కిషోర్‌ బాబు మఅతి అనుమానాస్పద ఆత్మహత్య వేధింపులకు కారణమా అని పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు అందించిన సమాచారం మేరకు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటలపాటు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం కిషోర్‌ బాబు మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి తల్లి తిరుమల ప్రేమలత పొన్నూరు సిఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️