ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 92వ వార్డు పరిధి బంటాకాలనీలో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్బాబుకు మద్దతుగా ఆయన తనయుడు రఘునాథన్ శుక్రవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రఘునాథన్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు హయాంలో హైదరాబాదును హైటెక్ సిటీగా తయారుచేశారని గుర్తుచేశారు. పంచకర్ల రమేష్ బాబు గతంలో ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, ఎంపిటిసి సభ్యులు గొల్లవిల్లి రమణ, సర్పంచ్ గొర్లె రామకృష్ణ, 94వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు పి.పార్వతి, జనసేన నాయకులు కోడిగుడ్ల వెంకటస్వామి, కోడిగుడ్ల ఈశ్వరరావు, నీలం శెట్టి శివ, గండ్రెడ్డి రమేష్, నీలంశెట్టి సాయికిరణ్, బంటా కాలనీ జనసేన నాయకులు ఆనంద్, పవన్, మురళి టిడిపి నాయకులు సేనాపతి రామకృష్ణ, బొబ్బరి రాము, ఎర్ర ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.