ఎన్నికల నిర్వహణ పై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌పి

May 10,2024 20:32

 ప్రజాశక్తి – సాలూరు : మన్యం జిల్లాలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ కోరారు. శుక్రవారం ఆయన నియోజకవర్గ పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో ఎఎస్పీ సునీల్‌ షారోన్‌, డిఎస్పీ మురళీధర్‌, టౌన్‌ సిఐ వాసు నాయుడు, రూరల్‌ సిఐ బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️