వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు

May 4,2024 10:48 #Heavy rain, #Special prayers

రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు ఈద్గా మైదానంలో శనివారం వరుణుడి కరుణ కోసం ముస్లిం సోదరులు సామూహిక ప్రత్యేక నమాజ్‌ ఆచరించారు. దాదాపు వెయ్యి మందికిపైగా ముస్లింలు హాజరు కాగా ప్రభుత్వ ఖాజీ మొహమ్మద్‌ సైఫుల్లా, ఉలమాల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. మౌలానా జుబేర్‌ నమాజ్‌ చేయించారు. హాఫిజ్‌ రహమతుల్లా అష్రఫీ కుద్బా పఠించగా ముఫ్తీ నూర్‌ ముహమ్మద్‌ వర్షం కోసం దువా పఠించారు. వర్షాల కురవక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షం కురిపించాలని అల్లాను ప్రార్థించారు.

➡️