రాష్ట్రాన్ని కాపాడుకుందాం

Mar 28,2024 21:38

ఎన్నికల ప్రచారంలో పల్లె రఘునాథరెడ్డి

                పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామనిమాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని బడే నాయక్‌ తండా, గోనే నాయక్‌ తండాలను ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టిడిపి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని ఆదరించాలని కోరారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కన్వీనర్‌ రామాంజనేయులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బెస్త చలపతి, బీడుపల్లి టిడిపి కౌన్సిలర్‌ జయప్ప, నాయకులు శంకర్‌, మనోహర్‌ బాల, జయరాం నాయక్‌, అంబులెన్స్‌ రమేష్‌, బేకరీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

బుక్కపట్నం :మండంలోని కృష్ణాపురం, మారాల, యాద లంకపల్లికి చెందిన టిడిపి నాయకులతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమావేశం నిర్వహించారు. గురువారం పుట్టపర్తిలోని తన కార్యాలయంలో మండలంలోని బూత్‌ కన్వీనర్లు, కృష్ణాపురం, మారాల, యాదలంకపల్లికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం లో టిడిపి జెండా ఎగరవేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మలిరెడ్డి, నాయకులు గోపాలపురం గంగాధర్‌, పల్లపు రవీంద్ర, నారాయణస్వామి, లింగప్ప గారి పల్లి రవి, ఆంజనేయులు, కిష్టప్ప, హరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️