జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలి

డిసెంబరు 3, 4 తేదీలలో శ్రీకాకుళంలో నిర్వహించే జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలని సిఐటియు

సమావేశంలో మాట్లాడుతున్న అమ్మన్నాయుడు

ప్రజాశక్తి – సోంపేట

డి సెంబరు 3, 4 తేదీలలో శ్రీకాకుళంలో నిర్వహించే జాతీయ సెమినార్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శులు ఎన్‌.గణపతి, ఎస్‌.లక్ష్మీనారాయణ కోరారు. సోంపేటలోని సిఐటియు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిఐటియు జాతీయ నాయకులు పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత, రాష్ట్రంలోని పలు కార్మికోద్యమ నాయకులు, కార్మికులు జాతీయ సెమినార్‌కు హాజరవుతారని చెప్పారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను సెమినార్‌లో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డి.యామయ్య, పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️