స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతా ఏర్పాట్లు పరిశీలన

సార్వత్రిక ఎన్నికల

సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ భద్రతా ఏర్పాట్లను స్థానిక శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక బుధవారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూముల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల కేంద్ర పోలీస్‌ బలగాల గార్డు, జిల్లా ఆర్మ్‌డ్‌ పోలీస్‌ గార్డు, సివిల్‌ పోలీస్‌ బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌కి నలువైపులా పటిష్ట భద్రతా ఏర్పాట్లు, నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీశారు. నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీ అధికారులు నిరంతరం పహారాను తనిఖీ చేయాలన్నారు.

➡️