సిపిఎంకాంగ్రెస్ను గెలిపిస్తేనే ఉక్కు సాకారం : సిపిఎంప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే స్టీల్ప్లాంట్ వస్తుందని సిపిఎం పట్టణ కార్యదర్శి జి.ఏసుదాసు పేర్కొన్నారు. శుక్రవారం మోరగుడి, పట్టణంలోని శివారెడ్డి కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏసుదాసు మాట్లాడుతూ ఇండియా వేదిక అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. గడిచిన పదేళ్లల్లో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. విభజన చట్టం హామీల్లోని ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్కు తెచ్చు కోవాలంటే ఇండియా వేదిక అధికారంలోకి రావాలన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కూడా అవసరమన్నారు. జమ్మలమడుగులో పాముల బ్రహ్మానందరెడ్డిని, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దాసరి విజరు, కమాల్బాషా, పోన్నతోట దివాకర్, రాజు, మున్నా పాల్గొన్నారు.