ఎన్నికల్లో ఆదరించండి : బిఎన్‌

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆదరిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి బిఎన్‌. విజయకుమార్‌ తెలిపారు. మండల పరిధిలోని చవటపాలెం ,అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ కుమార్‌ మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలతో పేదలకు ఎంతో కలుగుతుందన్నారు. రాష్ట్రాభివద్ధి టిడిపి తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, నాయకులు తేళ్ళ మనోజ్‌ ,గుమ్మడి సాయిబాబా, సెల్వం, దొడ్డా సీతారామయ్య, శ్రీను, రాజా, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️