మహిళా పోలీసు పర్యవేక్షణలో ప్రశాంతంగా పది పరీక్షలు

Mar 27,2024 16:51 #1oth exams, #alluri, #Tenth

 

ప్రజాశక్తి – అల్లూరి జిల్లా : పెదబయలు మండలములో పది రోజుల పాటు నిర్వహించిన పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మూడు పరీక్ష కేంద్రలైన 1, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2 గిరిజన గురుకులం, 3 నంబర్ 1 ప్రభుత్వ బాలికల పాఠశాల మొతంగా 609 మంది కి గాను జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకరు గైహాజరయ్యారు. ఆంగ్ల మద్యమం లో 176 మంది తెలుగు మాద్యమం లో 394 మంది హాజరయ్యారు. ప్రతి రోజు స్థానిక విద్యాశాఖధికారిణి గుమ్మా పుష్పవతి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షణ చేశారు. గురుకుల పాఠశాలలో చీప్ సూపరింటెండెంట్ రాము జానకిరామ్ బాలికల పాఠశాలలో చెట్టి నారాయణ, వి విశ్వనాధం జిల్లా పరిషత్ పాఠశాలలో సతీష్ మహేంద్రాలు అధికారులుగా వ్యవహారించారు.

➡️