ప్రజాశక్తి – కొత్తవలస : జిందాల్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకి చేరాయి. జిందాల్ యాజమాన్యం లే ఆఫ్ పేరుతో కార్మికులను బయటికి నెట్టి నేటికి 45 రోజులు గడుస్తున్నా యాజమాన్యం కనీసక స్పందించుకోవడంపై కార్మికులు, కార్మికులు నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల పట్ల కనికరం చూపి, కంపెనీ తెరవాలని ఆందోళన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికులను ఎటువంటి కారణం లేకుండా లే ఆఫ్ పేరుతో కంపెనీ బయట ఉంచడం విచారకరమన్నారు. జిందాల్ కర్మాగారంలో కార్మిక సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. జిందాల్ జెఎసి నాయకులు పిల్లా అప్పలరాజు, గాడి అప్పారావు, నమ్మి చినబాబు నాయకత్వంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/jindaal-copy.jpg)