లక్ష్య సాధనలో సవాళ్లను అధిగమించాలిప్రజాశక్తి-క్యాంపస్విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని, లక్ష్యసాధనలో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిడిని అధిగమించాలని సైకాలజిస్ట్ బండి రుక్మిణి అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహిళా అధ్యయన కేంద్రం రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ ఇ.కోనప్రభ శనివారం నర్సింగ్ విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించారు. డాక్టర్. కోనప్రభ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివద్ధికి విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే విలువలు, నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాభవాని, మహిళా అధ్యయన కేంద్ర సిబ్బంది ప్రీతి పాల్గొన్నారు.
![లక్ష్య సాధనలో సవాళ్లను అధిగమించాలి](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-144444444444444444.jpg)