రవి మనోహర ఆచారి డిఎస్పిగా బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుపతి డీఎస్పీగా కే.రవి మనోహర ఆచారి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు తిరుపతి, చంద్రగిరిలో జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందానికి నాయకత్వం వహించారు. మంగళవారం తిరుపతిలో ఈస్ట్ డిఎస్పిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన గతంలో తిరుపతి ఈస్ట్ సిఐగా ఉన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో శాంతి భద్రతలను కాపాడటంలో తనవంతు కృషి చేస్తానని, గంగజాతరలో, త్వరలో జరగబోవు ఎన్నికల కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటానన్నారు.