4న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ప్రజ్ఞా వికాస పరీక్ష

Jan 23,2024 18:05

  ప్రజాశకి-విజయనగరం టౌన్‌  :  ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాసం పరీక్ష ఫిబ్రవరి 4న నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రాము,విహెచ్‌ వెంకటేష్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎల్‌ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పరీక్ష లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. పరీక్షలో పాల్గొని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రైజ్‌ మనీ జిల్లా మొదటి స్థానానికి రూ.5,000, రెండో స్థానానికి రూ.3,000, మూడో స్థానానికి రూ.2,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. మండల స్థాయిలో 300మంది రాస్తే మొదటి మూడు స్థానాలకు మెమొంటోలు ఇస్తామన్నారు. పరీక్ష రాసే విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీ లోపు రూ.25 ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకొని హాల్‌ టిక్కెట్టు తీసుకోవాలన్నారు. పరీక్షల ముందు సినిమా, ఫోన్‌, సీరియల్స్‌, క్రికెట్లకు దూరంగా ఉంటూ కాలాన్ని వృథా చేయకుండా ఒక ప్రణాళికను రూపొందించుకొని బాగా చదవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులు ఈ కింది ఫోన్‌ నెంబర్లను సంప్రదించంలన్నారు.విజయనగరం-93817 68275, 75692 90549ఎస్‌.కోట- 79951 07340, 62810 56384గజపతినగరం- 96762 20612, 77804 69115బొబ్బిలి – 95025 07945, 79818 81073చీపురుపల్లి : 99858 25957, 85228 57986నెల్లిమర్ల : 79935 17081, 72888 49236రాజాం : 76800 25790జిల్లా కేంద్రం: 98663 02963,63029 78953,97055 45164, 94924 14763 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

➡️