ప్రజాశక్తి-ప్రత్తిపాడు (గుంటూరు) : ఎలక్షన్ కోడ్ అతిక్రమించిన కారణంగా యనమలకుదురుకు చెందిన వ్యక్తి పై మంగళవారం కేసు నమోదయింది. ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని, యనమదల గ్రామంలో ఈ నెల 23వ తేదీన రాత్రి టిడిపి, జనసేన పార్టీలు కలసి ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో టపాసులు కాల్చడం, డిజె సౌండ్ సిస్టమ్, తీన్మార్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించినట్లు ఫ్త్లెయింగ్ స్క్వాడ్ ద్వారా రాబడిన సమాచారం మేరకు తగు చర్య తీసుకోవాలని యనమలకుదురుకు చెందిన డి.కోటేశ్వరరావు పై ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు ఎస్ ఐ సోమేశ్వర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.