ప్రజాశక్తి -అనకాపల్లి :
ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సిద్దార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం- ఓటు హక్కును ఉపయోగించుకుందాం, మన ఓటు-మన హక్కు నినాదాలతో అసోసియేషన్ ముద్రించిన కరపత్రాలను శుక్రవారం పట్టణంలోని మెయిన్ రోడ్, చేపల బజార్, కస్పావీధి, కుంచా వారి వీధి, రామాలయం జంక్షన్, పిళ్లా వారి వీధి తదితర ప్రాంతాల్లో పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేశ్ గుప్తా, పెదిరెడ్ల సుజాత, ఓటర్లు పాల్గొన్నారు.