ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 91, 92 వార్డుల యాదవ సంఘాలతో కుమారి కల్యాణ మండపంలో వైసిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జివిఎంసి మేయర్ గొలగాని హరివెంకటకుమారి హాజరై మాట్లాడుతూ, వైసిపి పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్కుమార్కు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి యాదవులంతా ఓటువేసి గెలిపించాలని కోరారు. అనంతరం మేయర్ను, ఆడారి ఆనంద్ కుమార్ను యాదవ సంఘం నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బెహరా భాస్కరరావు, పేడాడ రమణి కుమారి, గేదెల మురళీకృష్ణ, ఉరుకూటి మహాలక్ష్మినాయుడు, ఉరుకూటి శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, శంకర్, నమ్మి రమణ, ఉప్పిలి, కనకరాజు, ఆనందరావు, పీతల అప్పలరాజు, సింహాచలం పాల్గొన్నారు.