విద్యుత్‌ షాక్‌తో యువరైతు మృతి

May 11,2024 23:53

వేంపాటి పరమేశ్వరరెడ్డి మృతదేహం
ప్రజాశక్తి-ఈపూరు :
ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి యువరైతు మృతి చెందిన సంఘటన మండలంలోని శ్రీనగర్‌లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్‌ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్‌ తగిలి కింద పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

➡️