ప్రజాశక్తి-పులివెందుల టౌన్ మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్యకు సూత్రధారులు ఎవరో తేల్చక పోవడంతో వారి కుటుంబంలో రాజకీయ చదరంగం ప్రారం భమైంది. వైఎస్.షర్మిలకు రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎటువంటి ప్రాధాన్యత కల్పించక పోవడంతో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టిపి పార్టీని స్థాపిం చడంతో వైఎస్.విజయమ్మ వైసిపి గౌరవ అధ్యక్షులుగా రాజీనామా చేశారు. అప్పటినుంచి వైఎస్ కుటుంబం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున వైఎస్ కుటుంబంలో రెండుగా చీలిక ఏర్పడి రాజకీయ రంగప్రవేశం చేశారు. రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబంలో చీలికలు ఏర్పాడ్డాయి. షర్మిల కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం, వైఎస్.జగన్మో హన్రెడ్డి వైసిపి తరఫున వైఎస్. అవినాష్రెడ్డిని బరిలోకి దింప డంతో ఓటర్ చేతిలోకి వారి కుటుంబ పంచా యితీ అయిపోయిందని చెప్పవచ్చు. వైఎస్ వివేక కుమార్తె సునీతకు షర్మిల మద్దతు తెలపడంతో వైఎస్ కుటుంబం మధ్య విభేదాలు మరింత తీవ్రతమయ్యాయి. బహిరంగంగానే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ వచ్చారు. బహిరంగ లేఖలు కూడా రాయడం జరిగింది. వైఎస్ఆర్ బతికుండగా రాజకీయ చరిత్రలో వైఎస్ కుటుంబానికి ఉన్న విలువ తెలియంది కాదు. వైఎస్ఆర్ బతికుండగా అందరూ ఒకే తాటిపై ఉండే వారు. ఏది చేసినా ఉమ్మడి కుటుంబం ద్వారానే జరిగేది. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ కుటుంబంలో రాజకీయ చిత్ర పటమే మారిపో యింది. జగన్ కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీని పెట్టడం జరిగింది. 2011లో పులివెందుల అసెంబ్లీ స్థానంలో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి వైసిపిలో చేరడం జరిగింది. తర్వాత వైఎస్ జగన్ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టడంతో పార్టీని వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతి, వివేక కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్తో పోరాటం చేశారు. 2019లో వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత కుటుంబ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో బేధాభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. రాజకీ యాలకు దూరమయ్యారు. వైసిపి అధ్యక్షులుగా ఉన్న విజయమ్మ ఆ పదవికి రాజీనామా చేశారు. నా ప్రమేయం లేకుండానే నేను చెప్పినట్లుగా ప్రకటనలు వెలువడటం నాకు ఇష్టం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ చిన్నాన్న హత్య విషయాన్ని పట్టించుకోవడం లేదని, ఎవరైతే హత్యకు సహక రించారో వారినే ముఖ్య మంత్రి హోదాలో జగన్ కాపాడుతున్నారని వివేకా నందరెడ్డి భార్య సౌభా గ్యమ్మ, కుమార్తె సునీత, వైఎస్ఆర్ కుమార్తె షర్మిల మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకు దారి తీసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తూ మాట్లాడిన మాటలు కుటుంబ సభ్యుల్లోని మనసుల్లో మరింత ఆందోళనకు కారణమ య్యాయి. అవినాష్రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదని నాకు నమ్మకముంది. అందుకే కడప పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చానని పులివెందుల నామినేషన్ సభలో జగన్ పేర్కొన్నారు. అవే కాకుండా పసుపు చీర కట్టుకొని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్ వారసులు అం టూ పరో క్షంగా వైఎస్ షర్మిల, సునీతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుం బంపై కుట్రలు చేసిన కాంగ్రెస్తో చేతులు కలిపారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ సౌభాగ్యమ్మ తన మనసులోని బాధను బయటకు చెప్పేందుకు ముఖ్య మంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు. నీ తండ్రి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించావో, మీ చిన్నాను కోల్పోయిన నీ చెల్లెలు సునీత కూడా అంత కంటే ఎక్కువ బాధను అనుభవించింది. మనో వేదనకు గురైంది. మీ చిన్నాన్న హత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం ఏమిటని ఆ లేఖలో జగన్ని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడే చెల్లెళ్లను హేళనగా మాట్లాడుతుంటే తనకు బాధగా ఉందనే భావనను లేఖలో ఆమె చెప్పారు. నీ పత్రిక, చానల్లో కూడా హత్యను వక్రీకరించి చెప్పడం చెల్లెళ్ల గురించి మరొకరు ఇష్టాను సారంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నా మనసును మరింతగా బాధపెడుతుందనేది ఆమె లేఖలోని మరో అంశం. హత్యకు కారకులైన వారికి టికెట్ ఇవ్వడం బాధగా ఉందని, న్యాయం, ధర్మం వైపు నిలబడాలని వేడుకొంటున్నానని ఆమె లేఖలో కోరడం విశేషం. వైఎస్ అవినాష్ తల్లి లక్ష్మి సౌభాగ్యమ్మకు ప్రతి లేఖ రాయడం జరిగింది. అనవసరంగా మా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని, బాధ పెట్టడం జరుగుతుందని నిజం తెలుసుకోకుండా ఆరోపణ చేయడం తగదన్నారు, వైఎస్ వివేకా వైఎస్ విజయమ్మపై పోటీ చేసినప్పుడు వైఎస్ జగన్ ఎంత బాధ పడ్డాడో మీకు తెలియదా? దొంగే దొంగ అంటే దొంగ ఎలా దొరుకుతాడు అని ప్రశ్నించింది. మాటలు, లేఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. క్షేత్రంలో అన్నా చెల్లెళ్ల మాటల తూటాలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిలపై కానీ , సునీత పై కానీ నేరుగా విమర్శలు గుప్పించకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వీళ్లను రాజకీయ పావులుగా వాడుకుంటున్నాయని తన ఎన్నికల ప్రసంగాల్లో చెబుతున్నారు. అయితే షర్మిల కానీ సునీత కానీ ముఖ్యమంత్రే తప్పు చేశారని, మా అన్నే మా నాన్న హత్యకు బాధ్యత వహించాలని నేరుగానో మాట్లాడుతున్నారు. ఈ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తమ గుండెల్లోతుల్లో నుంచి పుటుకొస్తున్న ఆవేదన అని రాజకీయ పరిశీలకుల్లో కొందరు వ్యాఖ్యానిస్తుండగా అధికారం కోసం జరిగే పోరాటంలో ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు అప్పుడప్పుడూ ఉంటాయని పరిశీలకుల్లోని మరి కొందరు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. తన బిడ్డ ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోర్కెను నెరవేర్చే విధంగా తగిన ఆశీర్వాదాలు ఇవ్వాలని వైఎస్ విజయమ్మ కోరుకుంటోంది. కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ఆర్ అభిమానులు నాకు అండగా నిలవాలని షర్మిల కోరుతోంది. నా తండ్రిని హత్య చేసిన హంతకులను శిక్షించడంలో మా అన్న జగన్ ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలని సునీత కోరుతోంది. చిన్నాన్నను చంపిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నావంటూ ఆవేదనతో ప్రశ్నిస్తోంది జగన్ చిన్నమ్మ సౌభాగ్యమ్మ. ఇవన్నీ చూస్తుంటే కుటుంబ సభ్యుల్లోనే ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవడం, బాధపడటం చూస్తుంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని ఓటర్లు తేలిగ్గా తీసుకుంటారా? వైఎస్ కుటుంబంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయనే అంశాన్ని తీవ్ర పరిగణలోకి తీసుకుంటారా వేచి చూడాల్సిందే.