‘పోచర్‌’కు నిర్మాతగా ఆలియాభట్‌

Feb 7,2024 08:21 #alia bhat, #movie

బాలీవుడ్‌ కథానాయిక ఆలియాభట్‌ నిర్మాతగా మారారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి ఆమె ఓ వెబ్‌ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్‌ సిరీస్‌ పోచర్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయ్యింది. స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈనెల 23న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. నమేషా సజయన్‌, రోషన్‌ మాధ్యూ కీలకపాత్రలు పోషించారు. ‘ఒక అద్భుతమైన ప్రాజెక్టులో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. ఈ భూమ్మీద జీవించే అన్ని జీవరాశులపై కరుణ, జాలి ఉండాలనే బలమైన సందేశాన్ని పోచర్‌ ఇస్తుందని నమ్ముతున్నా’ అని ఆలియాభట్‌ పేర్కొన్నారు.

➡️