తమిళ హీరో విజరు నటిస్తున్న సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)’. వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మీనాక్షీ శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, జయరామ్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, వైభవ్, యోగిబాబు, ప్రేమ్జీ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో స్టార్ క్రికెటర్ మహేంద్ర ధోని అతిథి పాత్రలో కనిపించనున్నట్లుగా సమాచారం. ఈ చిత్రంలో విజరు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విదేశాల్లో చిత్రీకరణ పూర్తిచేసుకుని ఈ చిత్ర యూనిట్ చెన్నైకు వచ్చింది.