కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ సోదరుడు రుద్ర సినీ రంగ ప్రవేశం ఖరారైంది. రుద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓహో ఎన్దన్ బేబీ’. కృష్ణకుమార్ రామ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ నటిస్తున్నారు. కోలీవుడ్లో ఆమె ఇదే మొదటి సినిమా. తొలి షెడ్యూల్ గోవా, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో జరగనుంది.