ఆస్కార్ 2024 అవార్డ్స్ కోసం పోటీ చేయడానికి 96వ అకాడమీ అవార్డుల చివరి షార్ట్ లిస్ట్ నుంచి భారతదేశ అధికారిక ఎంట్రీ ముగిసింది. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన 15 సినిమాల షార్ట్ లిస్ట్లో మలయాళీ చిత్రం ‘2018’ ఎంపిక కాలేదు. ఇదే విషయాన్ని ఆ సినిమా డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసెఫ్ తన ఇన్స్టా ద్వారా తెలిపారు. అయితే ఈ షార్ట్ లిస్ట్లో ‘టు కిల్ ఎ టైగర్’ సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఈ సినిమాను జార్ఖండ్ గ్యాంగ్ రేప్ ఆధారంగా రూపొందించారు. టరంటో ఫిల్మ్ మేకర్ నిషా పహుజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తుది నామినేషన్లు జనవరి 23, 2024న ప్రకటిస్తారు. ఆస్కార్ వేడుకలు 2024 మార్చి 10న జరగనున్నాయి.