15న ‘ఆలంబన’ విడుదల

Dec 11,2023 19:56 #New Movies Updates

సీనియర్‌ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్‌ నటించిన ‘ఆలంబన’ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదల చేశారు. పార్వతి నాయర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పారి కె.విజరు దర్శకత్వం వహించారు. మురళి శర్మ ఒక ప్రధాన పాత్ర పోషించారు. డిసెంబర్‌ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ‘ఈ సినిమాను థియేటర్లో చూస్తేనే ఆ విజువల్‌ బ్యూటీ, గ్రాండియర్‌ తెలుస్తుంది. సినిమాలో కామెడీని కూడా థియేటర్లలో బాగా ఎంజారు చేస్తారు’ అని వైభవ్‌ అన్నారు. ఇంకా ‘ఈ సినిమాలో జీనీ క్యారెక్టర్‌ బాగా అలరిస్తుంద’ని చెప్పారు. గంగ ఎంటర్టైన్మెంట్స్‌ అధినేత మహేశ్వర్‌ రెడ్డి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు.

➡️