ప్రభాస్ ‘సలార్’ చిత్రం ఫస్ట్ టిక్కెట్ను రాజమౌళి కొనుగోలు చేశారు. నైజాంలో సినిమాను విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫొటోను షేర్ చేసింది. ‘ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా. ఏఎస్ఎస్ రాజమౌళి నైజాంలో ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ ఫస్ట్ టిక్కెట్ను కొనుగోలు చేశారు. నైజాం విడుదల బుకింగ్లు అతి త్వరలో గ్రాండ్గా ఓపెన్ అవుతాయి’ అని చెబుతూ ఫొటో షేర్ చేశారు. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్లోని సంధ్య 70 ఎంఎంలో 7 గంటల ఆట కోసం రాజమౌళి టిక్కెట్ను కొనుగోలు చేశారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.