‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షెడ్యూల్‌ ముంబైలో ప్రారంభం

డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, ఉస్తాద్‌ రామ్‌ పోతినేని వారి బ్లాక్‌ బస్టర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌ అయిన మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షుట్‌ను తిరిగి ప్రారంభించారు. 2024లో అత్యంత క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఈ సినిమా షుటింగ్‌ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి సీక్వెల్‌తో టీమ్‌ రెట్టింపు యాక్షన్‌, రెట్టింపు మాస్‌, ఎంటర్‌ టైన్మెంట్‌ ఉండబోతుంది. ఈ చిత్రం కోసం రామ్‌ పోతినేని స్టైలిష్‌ మేక్‌ఓవర్‌ అయ్యారు. సంజయ్ దత్‌ పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

ఇస్మార్ట్‌ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్‌ మ్యూజిక్‌ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్‌ ఇస్మార్ట్‌కు మ్యూజిక్‌ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్‌ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్‌ చేస్తున్నారు.

➡️