‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌కు ఆఫ్రికాలో డాన్స్‌

త్రివిక్రమ్‌- మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతికి విడుదలైంది. ఇందులోని పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. మహేశ్‌ బాబు, శ్రీలీల, పూర్ణ ఈ పాటకు డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు రీల్స్‌లో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ పాటకు ఆఫ్రికన్‌ పిల్లలు స్టెప్పులు వేశారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ గేమ్స్‌ జరుగుతుండగా.. ఆట మధ్యలో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమంలో కొందరు అమెరికన్లు ఈ పాటకు డ్యాన్స్‌ వేశారు.

➡️