మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్ వంటి ప్రముఖ హీరోలు ఇప్పటికే ‘కన్నప్ప’ షూటింగ్ పార్ట్ను పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమా సెట్స్లోకి అడుగు పెట్టినట్లుగా విష్ణు ఓ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ టీం ఈ సినిమాకి పని చేస్తోంది.