హైదరాబాద్ : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్’. ఈ చిత్రంలో ప్రభాస్తోపాటు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు, శృతిహాసన్ వంటి ప్రముఖ తారాగణం నటించారు. ఈ చిత్రం ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. పదిరోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ.. మూవీ ప్రమోషన్స్ లేకపోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోయే ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’ వంటి చిత్రాల ప్రమోషన్లు ఇప్పటికే జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ మూవీ, ప్రశాంత్నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ చిత్ర ప్రమోషన్స్ కానీ, ప్రీరిలీజ్ ఫంక్షన్స్ కానీ లేవు. వాటిని జరిపేందుకు హోంబలే నిర్మాణ సంస్థ కూడా ముందుకు రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సలార్కి పోటీగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారఖ్ మూవీ ‘డంకీ’ పోటీగా నిలిచింది. డంకీ డిసెంబర్ 21వ తేదీన విడుదలవుతుంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ‘సలార్’, ‘డంకీ’ మూవీ విడుదల కానుండడంతో.. ప్రేక్షకులు ఖుషీగా ఉన్నారు. అయితే కలెక్షన్స్ పడిపోతాయని నిర్మాతలు భయపడుతున్నారు. ప్రస్తుతం సలార్ మూవీ టీం ప్రమోషన్స్, ప్రీరిలీజ్లు లేకపోవడంతో.. అసలు ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో కలుగుతుంది.