మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా, తమిళ హీరో జీవా వైఎస్ జగన్ గా నటిస్తున్న చిత్రం యాత్ర-2. మహీ వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వచ్చిన వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రానికి ఇది సీక్వెల్. తాజాగా, యాత్ర-2 చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. వై.ఎస్.ఆర్ మరణం.. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో జగన్ ఓదార్పు యాత్ర, దాని వల్ల ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను చూపెడుతూ ట్రైలర్ సాగింది.