- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక రూ.119 కోట్ల విలువ చేసే మద్యాన్ని, డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రాష్ట్ర ఎక్సైజ్శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా 150 చెక్పోస్టులు పనిచేస్తున్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 68,312 కేసులు నమోదు చేసి, 66,312 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యాన్ని నివారించేందుకు 39,232 మంది పోలీసులు పనిచేస్తున్నారని తెలిపింది. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరింది.