తిరువనంతపురం : బిజెపి గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పలు నివాసాల గోడలపై ఈ రకమైన సైన్బోర్డులు వెలిశాయి. ”మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. బిజెపి సభ్యులను లోపలికి అనుమతించం” అని ఓ అపార్ట్మెంట్ గోడపై రాసి వున్న సైన్బోర్డ్ను సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఐద్వా ఉపాధ్యక్షురాలు, జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు సుభాషిణి అలీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.