కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

Population attests to the message that the country's future is secure kerala cm

తిరువనంతపురం :   సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జూన్‌ 1 వరకు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు బిజెపిని గట్టి దెబ్బతీసిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసేందుకు అన్ని విధాలా యత్నిస్తున్న బిజెపిపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపనుందని అన్నారు. ప్రజల విశ్వాసంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా బిజెపి ప్రతిపక్షాల నోరు మూయించేందుకు మతపరమైన అంశాలతో పాటు అప్రజాస్వామ్య పద్థతులను వినియోగిస్తోందని మండిపడ్డారు. అటువంటి అప్రజాస్వామ్య పద్ధతులన్నింటినీ సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతీసిందని అన్నారు.

➡️