అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారానికి ‘స్వయంప్రభ’

Jan 4,2024 13:48 #cultural activities
aliasetti prabhakar award

 

ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్ : తెలంగాణ అక్షర సూరీడు ప్రసిద్దకవి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారానికి ఆదోనికి చెందిన జంగం స్వయం ప్రభ ఎంపికయ్యారు. సాహితీ కళా వేదిక జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రముఖ కవి అలి శెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతిని పురస్కరించుకుని 11వ తేదీన రాష్ట్రస్థాయి పురస్కా రాలు అందించనున్నారు. ఈ పురస్కారాలకు ఆదోనికి చెందిన కవయిత్రి జంగం స్వయంప్రభ, కరీంనగర్ కు చెందిన వాణిశ్రీ, మెట్ పల్లికి చెందిన శరత్చంద్ర, హైదరాబాద్ కు చెందిన సురేందర్ ఎంపికైనట్లు స్వయంప్రభ తెలిపారు. ఈ సందర్భంగా కవిసమ్మేళనం సాహితీ కళావేదిక వారు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపికైన స్వయంప్రభను సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు యంపి బసవరాజు అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఆవులబసప్ప చక్రపాణియాదవ్ లు హర్షం ప్రకటించారు.

➡️