ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త స్పాన్సర్ వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ఐపీఎల్కు ఐదేళ్ల పాటు స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ స్పాన్సర్గా టాటా గ్రూప్తో ఒప్పందం 2024 సీజన్ నుంచి 2028 సీజన్ వరకు వర్తిస్తుందని వివరించింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో లేనవిధంగా రూ.2,500 కోట్లతో స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ చేజిక్కించుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది.
🚨 NEWS 🚨
TATA Group secures title sponsorship rights for IPL 2024-28.
Details 🔽 #TATAIPL | @TataCompanieshttps://t.co/UE9fJ76zhT pic.twitter.com/tq3R2fq7lR
— IndianPremierLeague (@IPL) January 20, 2024